కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి..ప్రభుత్వమే మాకు చూపించాలి – రేవంత్‌

-

కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి..ప్రభుత్వమే మాకు చూపించాలని కొత్త డిమాండ్‌ ను తెరపైకి తీసుకొచ్చారు రేవంత్‌ రెడ్డి. వాస్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ బృందం పర్యటనకు ప్రభుత్వం అడ్డు పడుతోంది. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని సీఎల్సీ బృందాన్ని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రాజెక్టుల సందర్శనకు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని.. దగ్గరుండి ప్రభుత్వమే ప్రాజెక్టులను చూపించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమీ నష్టం జరగకుంటే దాన్ని చూపించడానికి కేసీఆర్ ఎందుకు వణుకుతున్నారు. పంపు హౌసులు మునగకుంటే, మోటార్లు విధ్వంసం కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు చూపించడానికి కేసీఆర్ ఎందుకు భయపడతున్నారని ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version