పగ, ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు రేవంత్ పాలన పరాకాష్టగా మారింది : దాసోజు శ్రావణ్

-

విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. పగ, ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు రేవంత్ పాలన పరాకాష్టగా మారిందని మండిపడ్డారు

తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా? అని ప్రశ్నించారు.ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకా సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రతీకార రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే దుష్ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version