రేవంత్ రెడ్డి నా డబ్బులతో తన కూతురి వివాహం చేశాడు: మంత్రి మల్లారెడ్డి

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ రెడ్డి, జీవితం మొత్తం బ్లాక్ మెయిల్ రాజకీయాలే, టిడిపిలో ఉన్నప్పటి నుంచే మా మధ్య గొడవలు ఉండేవన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ దరిద్రపు పార్టీ, రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మాటాష్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఒక పార్టీలో నిలకడలేదని.. ఒకవేళ బీజేపీలోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

నా కాలేజీలు మూయించేస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు అని ఆరోపించారు. రేవంత్ రెడ్డిది రచ్చబండ కాదని..లుచ్చాబండ, బ్లాక్ మెయిల్ బండ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి నా డబ్బులతో చేశాడని అన్నారు. కావాలంటే యాదగిరి గుట్ట మీద ప్రమాణం చేయమని రేవంత్ ను అడగండి అని అన్నారు. చివరకు రాహుల్ గాంధీని కూడా రేవంత్ బ్లాక్మెయిల్ చేసే రోజు వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version