సంస్కృతి గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాలి : రేణుదేశాయ్

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుత విషయాలపై త్వరగా స్పందిస్తుంటారు. విడాకుల తర్వాత కొడుకు, కూతురుతో కలిసి ఉంటున్న రేణు.. చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా మరో మూవీ కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక తన నివాసంలో గణపతి చండీ హోమం నిర్వహించిన రేణు.. పూజా కార్యక్రమాల్లో ఆమె తనయుడు అకీరా నందన్‌తో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ‘మన సంస్కృతి గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదే’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. ‘శరద్ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీహోమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాం. మన సాంప్రదాయలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలి. పూజ టైంలో ఆర్భాటం లేకుండా, ప్రశాంతంగా భక్తి మీదనే దృష్టి పెట్టాలి’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు తమకు తోచినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version