ప‌శ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..17మంది మృతి..!

-

పశ్చిమ‌బెంగాల్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఏకంగా 17మంది మృతి చెందారు. అంతే కాకుండా మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. మొత్తం 20 మంది వ్య‌క్తులు మెటాడోర్ వాహ‌నంలో మృత‌దేహాల‌తో స్మ‌శాన‌వాటిక వైపుకు వెళుతుండగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. హ‌న్స‌కాళి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పుల్బ‌ర్టి వ‌ద్ద రోడ్డు ప‌క్క‌న పార్క్ చేసి ఉన్న ట్ర‌క్కును మెటాడోర్ వాహ‌నం బ‌లంగా ఢీ కొట్ట‌డంతో ఈ ప్రమాదం సంభ‌వించింది.

అతి వేగం వ‌ల్లే ఈ పమాదం సంభ‌వించింద‌ని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా ద‌ట్ట‌మైన మంచు కురుస్తుంద‌ని ఆ మంచు కార‌ణంగా డ్రైవ‌ర్ కు ముందున్న వాహనం క‌నిపించ‌కపోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం సంభ‌వించి ఉండొచ్చ‌ని కూడా భావిస్తున్నారు. ఇక మృతి చెందిన కుంటుంబాల‌కు ఆ రాష్ట్ర సీఎం ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version