సీఎం జగన్ ఇంటికి వెళ్ళే దారిలో కుంగిన భూమి ?

-

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో మార్కెట్ సెంటర్ వద్ద భూమి లోపలోకి కుంగింది. సీఎం నివాసానికి వెళ్ళే దారి కావడంతో అప్రమత్తమైన అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏకంగా రోడ్డు మధ్యలో ఆరు అడుగులు మేర గొయ్యి ఏర్పడింది. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు దానికి తగ్గట్టు చర్యలు చేపట్టారు.

నిజానికి మొన్నటి ఎన్నికల ముందే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సమీపంలో స్థలం కొనుగోలు చేసి అక్కడ భారీ భవంతిని నిర్మించుకున్నారు. ఇప్పుడు సీఎం కాంప్ ఆఫీస్ కూడా అక్కడి నుండే రన్ అవుతోంది. ఈ క్రమంలో అధికారులు ఆ గోయ్యిని ప్రస్తుతానికి పూడ్చేస్తున్నారు. అసలు ఆ ప్రాంతంలో అంత పెద్ద గొయ్యి ఎందుకు పడింది అనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు ఆర్ అండ్ బీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version