గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్లో అర్దరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.రాఘవేంద్ర కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కళ్యాణపురి కాలనీల్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.మొహం కనిపించకుండా క్యాప్స్ పెట్టుకుని మరీ ఇళ్లల్లో చొరబడుతున్నారు.
పలు ఇళ్లలో చోరీకి యత్నించగా, కొన్ని ఇళ్లలో సోదాలు జరిపారు. అయితే, వారు ఎటువంటి విలువైన వస్తువులు దొంగిలించలేకపోయారు. అనుకోకుండా పెద్ద నష్టం తప్పటంతో నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీల్లో గస్తీ బలాన్ని పెంచాలని వారు పోలీసులను కోరుతున్నారు. ఇటీవలి కాలంలో ఉప్పల్ పరిధిలో దొంగల సంచారం పెరిగిందని, వారి నుంచి రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరుతున్నారు.
Hyderabad:
ఉప్పల్లోని రాఘవేంద్ర కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కళ్యాణపురి కాలనీల్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.
పలు ఇళ్లలో చోరీకి యత్నించగా, కొన్ని ఇళ్లలో సోదాలు జరిపారు. అయితే, వారు ఎటువంటి విలువైన వస్తువులు దొంగిలించలేకపోయారు. అనుకోకుండా పెద్ద నష్టం తప్పటంతో… pic.twitter.com/9mCByIdiCi
— Telangana Awaaz (@telanganaawaaz) April 17, 2025