జగన్ తో రోజా భేటీ.. నగరి రాజకీయం పై చర్చ..!

-

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్.కే.రోజా సమావేశం అయ్యారు. ఇటీవల కాలంలో నగరి నియోజకర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీశ్ ప్రకాశ్ ను వైసీపీలోకి చేర్చుకునేందుకు సన్నహాలు చేసింది అధిష్టానం. 

గాలి జగదీశ్ ప్రకాశ్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతని చేరికకు కాస్త బ్రేక్ పడింది. ఇవాల అదే అంశం పై రోజాతో మాజీ సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ గాలి జగదీశ్ ప్రకాశ్ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version