జూనియర్ ఎన్టీఆర్ పై RS ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్

-

జూనియర్ ఎన్టీఆర్ పై RS ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కులం లేదా అంటూ మండిపడ్డారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. నిన్న మునుగోడు నియోజక వర్గంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న సికింద్రాబాద్‌ లోని ఓ దళిత బీజేపీ కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు.

అయితే.. దళిత అనే పదం వాడటంపై RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. NTR కు మాత్రం కులం ఉండదట, కేవలం కార్యకర్తలకు మరి ముఖ్యంగా దళితులకే కులం ఉంటుదంట!! అంటూ మండిపడ్డారు. మీ దుంప తెగ, ఎన్ని రోజులు చేస్తరు భై ఈ మోసపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలు??? తెలంగాణ ప్రజలారా, మన రాజ్యం రావాలె. ఈ దొంగల దుకాణాలు బందు కావాలి అని ఫైర్‌ అయ్యారు. అటు కమ్యూనిస్టులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్‌ కుమార్‌. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడంపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version