IPL 2023 : నేడు ముంబైతో హైదరాబాద్‌ ఢీ.. ఉప్పల్‌ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

-

ఐపిఎల్ 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఐపిఎల్ 2023 లో ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ రోజు ఐపిఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

కాగా రెండు జట్లు కూడా ఈ టోర్నీని అపజయాలతో ప్రారంభించి ఆ తర్వాత రెండు వరుస విజయాలను సాధించి కొంచెం గాడిన పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్న విషయం పట్ల అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరుగనుంది. ఈ తరుణంలో తెలంగాణ ఆర్టీసీ… క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభభార్త చెప్పింది. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తామని… అర్ధరాత్రి వరకు బస్సులు నడుస్తాయని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా బస్సులు దించుతున్నామని ప్రకటన చేసింది తెలంగాణ ఆర్టీసీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version