తొలి అడుగు పడింది.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొలుకుంటున్నారు..!

-

సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. ఎస్పీ బాలు ఇవాళ స్పృహలోనే ఉన్నారని, నిన్నటి కంటే ఎంతో మెరుగ్గా కనపడ్డారని చరణ్ చెప్పారు. ఆయన అనారోగ్యం నుంచి కోలుకునే క్రమంలో తొలి అడుగు పడిందన్నారు. ఆయన తక్షణమే కోలుకోకపోయినా, నెమ్మదిగా కోలుకుంటారని చరణ్ తెలిపారు. ఈ మేరకు చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

అయితే ఎంతో మంది ప్రముఖులు, సామాన్యులు బాలసుబ్రహ్య‌ణ్యం ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కరోనా బారిన పడ్డ బాలసుబ్రహ్య‌ణ్యంని చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అక్కడ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. ఇక అప్పటినుంచి ఆయనకి లైఫ్ సపోర్ట్‌ తో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version