ఇంత ఫాన్ ఫాలోయింగ్ కి అదొక్కటే రీజన్ అంటున్న సాయి పల్లవి..

-

నటించిన తక్కువ సినిమాలతోనే ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి.. తన నటన డాన్స్ తో అభిమానుల్ని మెస్మరైజ్ చేయగలిగే ఈ బ్యూటీ 2015 లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ను ప్రారంభించారు. మలయాళంలో విడుదలైన ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అనంతరం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో తన నటనతో చెరగని ముద్ర వేశారు సాయి పల్లవి. అనంతరం ఎమ్మెల్యే, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తెలుగులో రానా సరసన విరాటపర్వం సినిమాలో నటించారు. అనంతరం సినిమాలపై కొంత ఫోకస్ తగ్గించిన సాయి పల్లవి మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఎంతో ఆత్మన్యునతకు గురయ్యానని కొన్ని విషయాలు తనను తీవ్ర సంఘర్షణకు గురి చేసే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు ఈ భామ.

 

కాగా కెరీర్ ప్రారంభంలో సాయి పల్లవి ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యారట. తనపై తనకు అసలు నమ్మకం ఉండేది కాదట. తన వాయిస్, డ్రెస్సింగ్, ముఖం మీద మొటిమలు కారణంగా తనను ప్రేక్షకులు ఆదరిస్తారా? దర్శకులు అవకాశాలు ఇస్తారా? అనే సందేహాలు ఉండేవట. ఆ భయంతో ఏం చేయాలన్నా సంకోచించేవారట. అయితే ప్రేమమ్ దర్శకుడు తనపై నమ్మకంతో ఆ పాత్రకు ఎంపిక చేశాడట. ప్రేమమ్ విడుదలయ్యాక ఆమెలో విశ్వాసం పెరిగిందట. ఆ సినిమా చూస్తూ నా పాత్రకు ఆడియన్స్ ఈలలు వేస్తూ, చప్పట్లు కొట్టిన క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేనని.. చాలా సినిమాల్లో మేకప్ లేకుండానే నటించానని, దర్శకులు కూడా మేకప్ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. బహుశా మేకప్ లేకుండా నటిస్తున్నందుకే ప్రేక్షకులు నన్ను అంతగా ఇష్టపడుతున్నారేమో… అని సాయి పల్లవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version