రైతులకు సపోర్ట్ చేస్తే రాళ్లతో కొడతారా ?: పవన్ కళ్యాణ్

-

ఈ రోజు కాసేపటి క్రితమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ పై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి కొందరు సత్యకుమార్ కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సత్యకుమార్ పై వైసీపీ కార్యకర్తలు దాడి జరగడం నిజంగా దురదృష్టం అన్నారు. ఈ విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని అంటూ రైతులకు మద్దతుగా ఉండడం తప్పా? ఎవరియాకైనా సపోర్ట్ చేస్తే జరిగే ప్రతిఫలం ఇదేనా అంటూ తనదైన శైలిలో స్మూత్ గా మాట్లాడారు.

ఈ విధంగా దాడి చేయడం ముమ్మాటికి తప్పే అన్నారు. ఈ సంఘటనను ఢిల్లీలోని బీజేపీ నాయకులూ సీరియస్ గా తీసుకునికయినా చర్యలు తీసుకోవాలని తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఇకనైనా మీ దౌర్జన్యాలను ఆపండి అంటూ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version