నయనతార కంటే సాయిపల్లవి బెటరా.. ఎందుకంటే..?

-

తెలుగు ఇండస్ట్రీలో నయనతార స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ లో అగ్రహీరోయిన్ గా కొనసాగిస్తోంది. ఇక తెలుగు, తమిళ భాషలలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక రెమ్యునరేషన్ పరంగా కూడా కోట్లలో ఛార్జ్ చేస్తూ ఉంటుంది. నయనతార కేటాయించిన కాల్షీట్ల ప్రకారం షూటింగ్ కచ్చితంగా జరగాల్సిందే..లేదంటే మరొక డేట్ కేటాయించడం కష్టం అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా ప్రమోషన్ విషయంలో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని ముందుగా అగ్రిమెంట్ చేయించుకుంటూ ఉంటుంది నయనతార. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఉంటుంది నయనతార. అయితే గతంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన అనామిక చిత్రం ప్రమోషన్ లో పాల్గొన్న నాయన తార ఈ మధ్య తన భర్త విగ్నేష్ తీసిన సినిమాలకు మాత్రం ప్రచారం చేస్తోంది.

దీంతో నయనతార పై ఎన్నో విమర్శలు తెరకెక్కాయి అయినా కూడా ఆమె ఐ డోంట్ కేర్ అన్నట్లుగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల ఇమేజ్ తో హీరోల స్టార్డం తో ఏ సినిమా కూడా ముందుకు వెళ్లలేదు. కేవలం కథతో మాత్రమే మార్కెట్ లోకి వెళ్లి మంచి సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు నయనతారని, సాయి పల్లవితో ముడిపెట్టి మాట్లాడడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.

సాయి పల్లవి గొప్ప డాన్సర్ మాత్రమే కాకుండా నటిగా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదని ..పారితోషకం లో నాయన తారకు పోటీగా వెళ్లబోతోంది అని ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఇక ఎలాంటి పాత్రలోనైనా నయనతార కన్నా సాయి పల్లవి ఉత్తమం గా నటిస్తుంది అని నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ మేరకు విరాటపర్వం సినిమాని తన భుజాల మీద మోసి పెద్ద సక్సెస్ లో భాగమైంది. దీంతో ఈమె బాగా పాపులర్ అయింది. ఇక చిత్రబృందం కోరిన విధంగా సాయి పల్లవి నటిస్తూ బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version