అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేయడానికి సిద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

-

ఈ రోజు అన్నమయ్య జిల్లా పుంగనూరు లో టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో దాడికి దిగిన విషయం రాష్ట్రము అంతటా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ విషయంపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల మాట్లాడుతూ, ఈ రోజు పుంగనూరు లో జరిగిన విద్వంస ఖాండ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే ఈ ఘర్షణలకు కారణమని సజ్జల చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు ముందుగా చెప్పిన విధంగా టీడీపీ కార్యకర్తలు బీరు బాటిళ్లు, కర్రలతో పోలీసులపై మరియు వైసీపీ నేతలపై దాడికి దిగారని సజ్జల చెప్పారు. ఇంతకాలం రాజకీయ అనుభవస్తుడని అని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు అనుభవం ఈ రోజు ఏమైందని సజ్జల ఫైర్ అయ్యారు..

కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయం చేసేంత స్థాయికి చంద్రబాబు దిగజారి పోయాడని సజ్జల మాట్లాడారు… అధికారం కోసం చంద్రబాబు ఏమి చేయడానికైనా సిద్ధం అని మరోసారి నిరూపించారని సజ్జల దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version