ధోని, కోహ్లీలు ఆడే ప్రతి బాల్ మీద బెట్… జాగ్రత్తగా ఉండండి !

-

సైబరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. ఎనిమిది మంది సభ్యుల ముఠాను పట్టుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు 22 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు అయితే మరో 9 మంది పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చందూర్ శశాంక్ అనే ప్రధాన బూకీని అరెస్టు చేశామని సజ్జనార్ తెలిపారు. ఇతనితో పాటు మరో ఏడుగురు ఫంటర్స్ ను అరెస్టు చేశామన్న ఆయన భర్కత్ అనే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడని అన్నారు.

మొబైల్ ఫోన్ లోనే ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అన్నారు. ఐపీఎల్ ధోని, కోహ్లీలు ఆడే ప్రతి బాల్ ను బెట్టింగ్ చేస్తుంటారని అన్నారు. మొదటి సారిగా 50 వేలు కట్టాల్సి ఉంటుందని ,యువత ఎక్కువగా ఈ బెట్టింగ్ లు ఆడుతున్నాని అన్నారు. పేరెంట్స్ యువకులు పై దృష్టి ఉంచాలని, బెట్ 365, డ్రీం 11, ఎంపీఎల్, బెట్ వే, డ్రీంగురు, మై 11 సర్కిల్, బెట్ 365, కోరల్, బివిన్, 777 బెట్, డెఫాబెట్ , విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్‌ఫ్రడ్‌, లోటస్ క్రికెట్ లైన్ తదితర మొబైల్ యాప్ ల లో వచ్చే రేటింగ్ లు ద్వారా బెట్టింగ్ లు చేస్తున్నారు అని అన్నారు. ఎవరికైనా బెట్టింగ్ లకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9490617444 నెంబర్ కు కాల్ చేయండని సజ్జనార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version