SAMANTHA : రూ.500 కోసం ఆ పని చేశా..సమంత సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. ఇక ఇటీవలే స్విట్జర్లాండ్‌ ఎంజాయ్‌ చేసిన సమంత.. తిరిగి ఇండియా చేరుకుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన బాల్య జీవితం గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టింది.

చదువులో తాను టాప్‌ స్టూడెంట్‌ అయినప్పటికీ.. డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని సమంత చెప్పింది. హీరోయిన్‌ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్లలో అతిధులకు వెల్‌ కమ్‌ చెప్పే అమ్మాయిగా కూడా పని చేశానని.. ఆ పని చేసినందుకు నిర్వాహకులు తనకు రోజుకు రూ.500 ఇచ్చేవారని షాకింగ్‌ నిజాలు బయటపెట్టారు. అంతేకాదు.. పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ దిశగా అడుగులు వేసే సమయంలో.. నీకు ఇది అవసరమా? అని కొంత మంది వెనక్కి లాగే ప్రయత్నం చేశారని పేర్కొంది సమంత. అయితే.. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ముందడుగు వేశానని చెప్పారు సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version