ఏపీ : స్కూల్ కు వెళ్లనని ఏడ్చిన విద్యార్థిని..కారణం తెలిసి షాక్ అయ్యిన పేరెంట్స్…!

-

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వేధింపులు మొదలుపెట్టాడు. దాంతో ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థిని స్కూల్ కి వెళ్ళలేదు. విద్యార్థిని ఎన్నో ఇబ్బందులు పడింది. చివరికి తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాలకు వెళ్లేందుకు భయపడింది.

rape

దసరా సెలవులు ముగిసిన తర్వాత స్కూల్ కి వెళ్ళమంటే ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తనను ఓ టీచర్ వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులతో వాపోయింది. ఈ విషయం తెలుసుకొని ఆగ్రహంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్థానికులతో కలిసి స్కూల్ కి వెళ్ళారు. అక్కడే ఉన్న టీచర్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ కీచక టీచర్ ను పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటనపై స్థానికులు సీరియస్ అవుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version