జగన్ ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తితో ఉన్నారు – వైసీపీ ఎమ్మెల్యే

-

జగన్ ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తితో ఉన్నారని ప్రొద్దుటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

పిఆర్సి జీతభత్యాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు కొద్దిగా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే తెలిపారు. వ్యక్తిగతం కంటే వృత్తి ధర్మం గొప్పదని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య చాలా స్వల్పమని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version