ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 20 మంది పోలీస్ అధికారుల బదిలీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవర్ధవంతమైన పాలన అందించేందుకు మరో సంచలనం వైపు అడుగులు వేసింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టింది. ఐఏఎస్, ఐపీఎస్ లతో  పాటు పలువురు ఉన్నతాధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పోలీస్ శాఖలోని పలువురు అధికారుల అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. అయినా ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ నేతల కు సహకరిస్తున్నారని ఇటీవల మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ నేతలు కూడా చెప్పారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలువురు డీఎస్పీలను తాజాగా బదిలీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version