హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్..షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలని వైటీపీ అధినేత షర్మిల వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరు మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని వ్యాఖ్యానించారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

రేపు, మాపు అంటూ నిరుద్యోగులను ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక నుంచి నిరుద్యోగుల పక్షాన వైటీపీ తెలంగాణ పార్టీ పోరాటం మరింత ఉదృతం చేస్తుందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version