వైఎస్ షర్మిల: నా భవిష్యత్తు తెలంగాణలోనే… తెలంగాణతోనే… !

-

తెలంగాణాలో పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తాజాగా తన భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణాలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి అడుగుతున్న నాపై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. షర్మిల మాట్లాడుతూ నాపై పనిగట్టుకుని మరీ ఊహాజనిత కథలను అల్లుతూ ప్రజలకు నాకు మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మరియు ఇతర టీం అంతా ఇవన్నీ చేయడం మాని ప్రజలకు సరైన పాలనను అందించడంలో దృష్టిని పెట్టాలని కామెంట్ చేసింది షర్మిల. నా చివరి శ్వాస ఆగే వరకు తెలంగాణ ప్రజలతోనే నా భావిస్తోష్యత్తు ముడిపడి ఉంటుందని చెప్పింది. నేను బ్రతికే ప్రతి క్షణం కూడా తెలంగాణ లో రాజన్న పాలనను తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపింది.

కాగా తెలంగాణాలో ఎప్పటికప్పుడు కేసీఆర్ పాలనను ప్రశ్నిస్తూ అధికార పార్టీకి షర్మిల టార్గెట్ గా మారిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version