షాకింగ్: వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ లకు పుజారా ఔట్..

-

ఐపీఎల్ అనంతరం టీం ఇండియా ఆడిన ఏకైక అంతర్జాతీయ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. కానీ ఈ మ్యాచ్ లో టీం మొత్తం మూకుమ్మడిగా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా తో ఆడిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో ఛతేశ్వర్ పుజారా సీనియర్ ఆటగాడు అయినప్పటికీ పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో 14 మరియు రెండవ ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రభావం వెస్ట్ ఇండీస్ తో వచ్చే నెలలో జరగనున్న టెస్ట్ సిరీస్ పై పడింది. ఈ రోజు విడుదల చేసిన టెస్ట్ జట్టులో పుజారా పేరు లేకపోవడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు.

పుజారా కు బదులుగా యంగ్ ప్లేయర్ ఋతురాజ్ గైక్వాడ్ ను జట్టులోకి తీసుకుంది. ఇకనైనా పుజారా దేశవాళీ మ్యాచ్ లలో రాణించి మళ్ళీ టీం లోకి వస్తాడా లేదా ఇదే ముగింపు కానుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version