పుజారాను అందుకే జట్టు నుండి తీసేశారు…

-

తాజాగా ఈ రోజు వెస్ట్ ఇండీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ జట్టులో అనూహ్యంగా వెటరన్ సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారాకు సెలెక్టర్లు మొండిచెయ్యి చూపారు. ఇది గమనించిన పుజారా అభిమానులు ఎందుకు జట్టులోకి తీసుకోలేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై క్రికెట్ వర్గాలు ఒక కారణాన్ని తెలియచేసే ప్రయత్నాలు చేశాయి. ప్రస్తుతం అంతగా అనుభవం లేని వెస్ట్ ఇండీస్ జట్టుతోనే టెస్ట్ సిరీస్ ఆడుతుండడం వలన పుజారాకు రెస్ట్ ఇచ్చారని… అతని స్థానంలో ఐపీఎల్ లో రాణించిన కొందరు యువ ప్లేయర్ లకు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ టూర్ జరిగే సమయంలో ఇండియా లో జరగనున్న జాతీయ లీగ్ దులీప్ ట్రోఫీ లో ఆడనున్నాడు.

అయినప్పటికీ అభిమానులు శాంతించకుండా ఒక్క మ్యాచ్ ఆడనంత మాత్రాన ఎలా టెస్ట్ జట్టు నుండి తీసేస్తారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version