బైజూస్ సీఈఓ కి షాక్..!

-

ఇటీవల కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బైజూస్ వ్యవస్థాపకుడు సీఈఓ రవీంద్రన్ కి కష్టాలు మరిన్ని ఎక్కువయ్యాయి. దేశం విడిచి వెళ్లకుండా ఆయన మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రవీంద్ర మీద లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కోరింది. ఫిబ్రవరి 23 తేదీన కంపెనీ వాటాదారుల అసాధారణ బోర్డ్ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మీటింగ్ ముందు కీలక పరిణామం జరిగింది.

ఇప్పటికే ఆయన మీద ఆన్ ఇంటిమేషన్ లుక్ అవుట్ నోటీసులు అమల్లో ఉన్నాయి దీంతో రవీంద్రనాథ్ ఇతర దేశాలకి ప్రయాణం చేసినప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ముందుగానే ఈడీకి సమాచారాన్ని ఇస్తారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news