16 గంటలు అయినా ఈ బాధ తగ్గడం లేదు: శుబ్ మాన్ గిల్

-

ఇండియా ఆస్ట్రేలియా మధ్యన జరిగిన తుది సమరంలో ఆరవ సారి వరల్డ్ కప్ ను చేజిక్కించుకుని సత్తా చూపించింది ఆసీస్. ఈ ఓటమి కారణంగా టీం ఇండియా అభిమానులు ఎంతగానో నిరాశకు గురయ్యారు. తాజాగా ఈ ఓటమి గురించి ఒక్కరొక్కరుగా ఎమోషన్ ను బయట పెడుతున్నారు టీం ఇండియా ప్లేయర్స్. వరల్డ్ కప్ లో ఓటమి పై శుబ్ మాన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ లు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. గిల్ మెసేజ్ ద్వారా “దాదాపు 16 గంటలు పూర్తి అయ్యాయి, కానీ ఈ ఓటమి బాధ నుండి మేము ఇంకా కోలుకోలేక పోతున్నాము అంటూ గిల్ పోస్ట్ చేశాడు. ఇంకా ఈ పోస్ట్ లో మేము ఈ వరల్డ్ కప్ కోసం చాలా కష్టపడ్డాము.. కానీ మా చివరి సమరంలో గెలవలేక కప్ ను చేజార్చుకున్నాము అంటూ ఎమోషనల్ గా ఫీలయ్యాడు.

ఇండియా టీం తో ఈ నెల రోజులు గడిచిన ప్రతి నిముషం ఎంతో ప్రత్యేకం అన్నాడు గిల్. అభిమానులుగా మా గెలుపుకోసం మీరు పంచే ప్రేమ మరియు అంతులేని అభిమానానికి థాంక్స్ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version