తెలంగాణలో కాల్పుల మోత..ఆరుగురు మావోయిస్టులు మృతి

-

తెలంగాణలో మరోసారి తుపాకుల మోత మోగింది. గురువారం భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో గాలింపు చర్యలకు చేపట్టిన పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు.

ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు ఎదురుకాల్పులకు దిగారు. రెండు వైపుల నుంచి భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తోంది.మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గాయాలపాలైన పోలీసులను చికిత్స నిమిత్తం మణుగూరుకు తరలించినట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version