అతడి వల్లే ప్రశాంతంగా నిద్రపోతున్నా : అడవి శేష్..!!

-

విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించగలిగే హీరోలలో అడవి శేషు ముందుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి సారి కూడా ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సమాజానికి మంచి మెసేజ్ ను అందిస్తూ ఉంటాడు. ఇకపోతే తాజాగా ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు అడవి శేష్.. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను మాట్లాడుతూ.. ఒకరి వల్ల చాలా ప్రశాంతంగా నిద్ర పోతున్నాను అంటూ తెలిపారు. ఎవరు అతడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.ఇకపోతే మేజర్ సినిమాని ప్రమోట్ చేస్తూ అడవి శేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు మధ్య చాలా గ్యాప్ ఉన్నప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులం అని కామెంట్ చేశాడు. వారానికి ఒక్కసారైనా సరే తామిద్దరం బయట కలుస్తూ ఉంటాం అని , అలా కలిసినప్పుడు తమ ఇద్దరి మధ్య ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చకు వస్తాయనే రహస్యాన్ని బయటపెట్టాడు. ఇక అకీరానందన్ చాలా మృదుస్వభావి అని .. ఇక తను ఎక్కడా కూడా ఒక టాప్ హీరో కొడుకు నన్న గర్వం చూపించడు అని సాదాసీదా వ్యక్తి లాగా ఉంటాడు అని తెలిపాడు.

ఇక వాస్తవానికి భవిష్యత్తులో అకీరానందన్ మంచి సినిమా హీరో అవుతాడో లేదో తెలియదు కానీ మంచి మ్యూజిషియన్ అవుతాడు అని చెప్పడంలో సందేహం లేదు అంటూ తెలిపాడు. ఇక అకీరానందన్ కు మ్యూజిక్ పట్ల విపరీతమైన అభిరుచి ఉంది అని తరచూ తాను కంపోజ్ చేసే పియానో మ్యూజిక్ బిట్స్ ని ప్రతిరోజూ తనకు పంపిస్తూ ఉంటాడు అని తెలిపాడు. ఇక అకీరానందన్ పంపించే మ్యూజిక్ బిట్స్ వింటూ రాత్రులు చాలా ప్రశాంతంగా నిద్ర పోతాను అని అకీరానందన్ వల్లే ఇది సాధ్యమైంది అని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version