BREAKING : ఏపీ బయలు దేరిన సోమేష్ కుమార్..నేడు జగన్ తో సమావేశం

-

 

తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే.. ఇవాళ ఏపీలో ఇవాళ తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్… రిపోర్ట్‌ చేయనున్నారు. ఇందులో భాగంగానే, కాసేపటి క్రితమే విజయవాడ బయలుదేరారు తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్. 10 గంటలకు ఏపీ సీఎస్ తో భేటీ కానున్నారు సోమేష్ కుమార్. అనంతరం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు సోమేష్ కుమార్. అయితే, సోమేష్ కుమార్ కు ఏపీ సర్కార్‌ ఏ పోస్టు ఇస్తుందోననే దానిపై అందరికీ ఆసక్తి గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version