కొడుకు పోయిన బాధలోనే తిట్టారు, పట్టించుకోను: ఎమ్మెల్యే

-

హైదరాబాద్ వరదల్లో పలువురు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆనంద్ అనే వ్యక్తి బీరం గూడలో కొట్టుకుపోయాడు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీరం గూడ ఇసుక బావి వాగు లో కొట్టుకు పోయిన ఆనంద్ కోసం గాలిస్తున్నాం అని ఆయన అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఆనంద్ ఆచూకీ కోసం వెతుకుతున్నాం అని అన్నారు.

వాగు దాటే ప్రయత్నం లో కారు వరద నీటిలో కొట్టుకు పోయింది అని చెప్పారు. మేము వెంటనే స్పందించలేదు అని కుటుంబ సభ్యుల చెప్పడం సరైంది కాదని ఆయన వివరణ ఇచ్చారు. వెంటనే స్పందించి ,అధికారులు మొత్తం పడవలతో గాలించామని అన్నారు. దాదాపు 15 కిలో మీటర్ల వరకు ఈ వాగు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కారు, ఆనంద్ ఆచూకీ లభించే అవకాశం ఉందని చెప్పారు. నాపై కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారని, కొడుకు ని పోగొట్టుకున్న భాద, కోపం లో నాపై ఆరోపణలు చేశారు, వాటిని నేను పట్టించుకోను అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version