యూట్యూబ్ చానెల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహణ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్లోని ఓ స్టూడియోపై పోలీసుల దాడులు జరిపారు. అక్కడ 10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ చానల్ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్దారించారు. ప్రస్తుతం ఆ చానెల్ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచవరం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహణ..
విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్ లోని ఓ స్టూడియోపై పోలీసుల దాడి
10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తింపు
చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ను అడ్డం… pic.twitter.com/wIAm4jeyya
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025