మళ్లీ టి20 పగ్గాలు చేపట్టబోతున్న విలియమ్సన్….

-

 

న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ మళ్లీ టి20 మ్యాచ్ లకి సారథ్యం వహించబోతున్నారు. బంగ్లాదేశ్ జరిగే టి20 సిరీస్ కి విలియమ్సన్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఈరోజు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ తో ఈనెల 27 న ప్రారంభం కాబోయే టి20 సిరీస్ కి 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.

ఈ సంవత్సరం ఐపిఎల్ సీజన్లో గుజరాత్ తరపున ఆడిన విలియమ్సన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మొదటి మ్యాచ్లో మోకాలు గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. దాదాపు 5 నెలలు రిహాబిలైటేషన్ సెంటర్లో ఉన్నాడు. ఈ సమయంలో అతడు అసలు వరల్డ్ కప్పు ఆడతాడు లేదా అన్న సందేహాలు కలిగాయి. బలమైన దృఢ సంకల్పం ఉన్న కారణంగా మళ్లీ భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఆడి 256 పరుగులు చేశాడు.

 

 

న్యూజిలాండ్ స్క్వాడ్ : కేన్ విలియ‌మ్స‌న్(కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మ‌న్, కైలీ జేమీస‌న్, అడ‌మ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషం, గ్లెన్ ఫిలిఫ్స్, మిచెల్ శాంట్న‌ర్, బెన్ సియ‌ర్స్, టిమ్ సీఫెర్ట్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version