WTC ఫైనల్ 2023: కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం.. మ్యాచ్ ఆడేనా ?

-

రేపు మధ్యాహ్నం నుండి ఇంగ్లాండ్ లో లార్డ్స్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన WTC ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు కోసం ఇరు జట్లలోని ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్క రోజులో మ్యాచ్ ఉండగా టీం ఇండియాకు ఒక చేదు వార్త వినిపించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చిన్న గాయం అయింది. రోహిత్ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా అతని ఎడమచేతి బొటన వేలుకు బంతి బలంగా తగలడంతో గాయం అయినట్లు యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఆ బొటనవేలికి టేప్ చుట్టుకుని ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ బాటింగ్ చేయలేదని సమాచారం. మరి గాయం తీవ్రత ఏమిటన్నది తెలియదు.

కానీ మ్యాచ్ కు దూరం అయ్యే అంత ప్రమాదం కాదని మాత్రం తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వచ్చే వరకు ఏమీ చెప్పలేము. ఒకవేళ రోహిత్ ఈ మ్యాచ్ నుండి తప్పుకుంటే ఎవరు కెప్టెన్ గా చేయనున్నారు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version