IPL 2022 : నేడు గుజరాత్, లక్నో ల మధ్య తొలి మ్యాచ్

-

ఐపీఎల్ 2022 నిన్న టోర్నీ మార్చి 25 వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మూడో రోజు ఐపీఎల్ లో… ఒక మ్యాచ్‌ జరగనుంది. ఇవాళ ఐపీఎల్‌ కొత్త జట్లైన గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ గేంట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని ఫేమస్‌ వాంఖేడ్‌ స్టేడియం లో జరగనుండగా.. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

గుజరాత్‌ టైటాన్స్‌ కు హార్థిక్‌ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తుండగా… లక్నో సూపర్‌ గెంట్స్‌ జట్టుకు… కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్నాడు.

రెండు జట్ల సభ్యుల వివరాలు ఇవే :

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(w), వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా(సి), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ,

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(సి), క్వింటన్ డి కాక్(డబ్ల్యూ), మనీష్ పాండే, దీపక్ హుడా, మనన్ వోహ్రా, కృనాల్ పాండ్యా, అంకిత్ రాజ్‌పూత్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, షాబాజ్ నదీమ్,

Read more RELATED
Recommended to you

Exit mobile version