భారత ప్రముఖ క్రికెటర్ రింకు సింగ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, రింకు సింగ్ వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి డేట్ కూడా ఫైనల్ అయింది. జూన్ 8న లక్నోలో ఎంగేజ్మెంట్, నవంబర్ 18న వారణాసిలో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రియా సరోజ్ యూపీలోని మచ్లీషహార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీగా మాత్రమే కాకుండా మరోవైపు ప్రియా సరోజ్ లాయర్ గానూ తన విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రియా సరోజ్ తండ్రి సైతం రాజకీయవేత్త. ఆయన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రింకు సింగ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో తన ఆట తీరును కనబరుస్తున్నారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి వార్తా తెలిసిన అనంతరం రింకూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.