ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో సంచలనం నమోదు అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్స్కు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్… సరికొత్త చరిత్ర సృష్టించింది. ముంబయి ఇండియన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గిన పంజాబ్ కింగ్స్…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్స్కు దూసుకెళ్లింది.

ఇక జూన్ 3వ తేదీన ఫైనల్స్లో ఆర్సీబీతో తలపడనుంది పంజాబ్ కింగ్స్. ఈ తరుణంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో 11 ఏళ్ళ తర్వాత ఫైనల్స్కు పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. అది కూడా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ లో కావడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్మిత 20 లో ఆరు వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసి ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్.