IPL 2025 : ఫైనల్స్ కు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. 11 ఏళ్ళ తర్వాత

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో సంచలనం నమోదు అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్… సరికొత్త చరిత్ర సృష్టించింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గిన పంజాబ్ కింగ్స్…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

IPL 2025 To Get New Champion, Punjab Kings Set Final Clash With RCB After Beating Mumbai Indians
IPL 2025 To Get New Champion, Punjab Kings Set Final Clash With RCB After Beating Mumbai Indians

ఇక జూన్ 3వ తేదీన ఫైనల్స్‌లో ఆర్సీబీతో తలపడనుంది పంజాబ్ కింగ్స్. ఈ తరుణంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో 11 ఏళ్ళ తర్వాత ఫైనల్స్‌కు పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. అది కూడా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ లో కావడం గమనార్హం.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్మిత 20 లో ఆరు వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసి ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్.

Read more RELATED
Recommended to you

Latest news