ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ భామ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి మృణాల్ ఠాకూర్ చేరుకోగానే తన చుట్టూ చాలా మంది మీడియా ప్రతినిధులు వచ్చి అనేక రకాల ప్రశ్నలు అడిగారు.
వాటన్నింటికీ మృణాల్ ఠాకూర్ చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడికి శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్ రాగానే తన చుట్టూ ఉన్న వారంతా జాన్వి కపూర్ వద్దకి పరుగులు తీసుకుంటూ వెళ్లారట. ఆ సమయంలో తనకు ఎంతగానో బాధగా అనిపించిందని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో వారసత్వానికి ఉన్నంత ప్రాధాన్యత కష్టపడి పైకి వచ్చిన వారికి లేదంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తాను ఇలా మాట్లాడడంపై జాన్వి కపూర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.