కన్నీళ్లు పెట్టుకున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివ కుమార్. బెంగుళూరు చిన్నస్వామి సంఘటన పై కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివ కుమార్ స్పందించారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.చిన్న పిల్లలు కూడా చనిపోవడం చాలా బాధగా ఉంది.

10 మంది నా కళ్లెదుటే ప్రాణాలు వదిలారు.. వాళ్ల బాధను కళ్లారా చూశానని తెలిపారు కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివ కుమార్. ఏ కుటుంబం కూడా ఇంతటి విషాదాన్ని జీర్ణించుకోలేదు.. మనం దీన్నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివ కుమార్.
కాగా, మంజునాథ వీరప్ప కంబార్ (28) నిన్న స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. మంజునాథ ఈరప్ప కంబార్ భార్య ప్రస్తుతం గర్భిణీ. మంజునాథ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విజయవాడలో మరో వ్యక్తి ఆర్సిబి సంబరాలు చేసుకుంటున్న సమయంలో బైక్ పైన వెళ్తూ కిందపడి శేఖర్ (30) అనే వ్యక్తి మరణించాడు.
#WATCH | Bengaluru: Karnataka DCM DK Shivakumar breaks down as he comes out to address the media for the first time after the #BengaluruStampede. pic.twitter.com/1GDMZOBAm4
— ANI (@ANI) June 5, 2025