ఢిల్లీ సాకేత్ కోర్టులో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఒక్క ఖైదీని… ఇద్దరు ఖైదీలు కొట్టి చంపారు. ఈ సంఘటన ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ సాకేత్ కోర్టులో.. ఉన్న హాల్లోనే ఖైదీలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమన్ అనే ఖైదీని దారుణంగా ఇద్దరు ఖైదీలు కొట్టడం జరిగింది.

బీహార్ జైలు నుంచి ఖైదీలను తెచ్చి సాకేత్ కోర్టులో పోలీసులు ఇవ్వాల హాజరు పరిచారు. ఈ సందర్భంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే కోర్టు లాకప్ లో గొడవపడ్డారు ఖైదీలు. ఇంకేముంది అమన్ అనే ఖైదీని దారుణంగా కొట్టి మరో ఇద్దరు ఖైదీలు చంపారు. ఈ సంఘటన ఎప్పుడు దేశ వ్యాప్తం గా హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.