Asia Cup 2022 : ఆరేళ్ల తర్వాత బౌలింగ్ చేసిన కోహ్లీ..

-

ఆసియా కప్ లో ఇండియా దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా… బుధవారం హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లోను టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్… సూర్యకుమార్ మాస్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టి20 క్రికెట్ లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. హాంకాంగ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన కోహ్లీ, కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కోహ్లీ బౌలింగ్ కు అతడి అభిమానులు ఫీదా అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version