మరోసారి సత్తా చాటిన మనుబాకర్..!

-

పారిస్ ఒలింపిక్స్ మిక్స్ డ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జట్టు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో సర్ బ్ జోత్ సింగ్, మనుబాకర్ జోడీ 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాంస్యం బరిలో చోటు దక్కించుకుంది. క్వాలిఫికేషన్ పోరులో టాప్ 4 లో నిలిచిన వారు ఫైనల్ పతక పోరుకు అర్హత సాధిస్తారు. ఇందులో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న వారు స్వర్ణం కోసం పోటీ పడతారు.

అక్కడ ఓడిన వారికి రజతం లభిస్తుంది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న వారు కాంస్య పోరు కు తలపడుతారు. సోమవారం జరిగిన ఈ అర్హత మ్యాచ్ లో మను-సరబ్ జోత్ జోడీ 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో రేపు వారు దక్షిణ కొరియా ద్వయంతో కాంస్య పతకం కోసం పోటీ పడనున్నారు. ఇందులో గెలిస్తే.. భారత్ కు మరో పతకం దక్కుతుంది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత జోడీ రిథమ్-అర్జున్ చీమా పదో స్థానానికి పరిమితమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version