గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని వేర్వేరు నగరాలకు కనెక్టివిటీ ఇవ్వండి : ఎంపీ కేశినేని చిన్ని

-

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని వేర్వేరు నగరాలకు కనెక్టివిటీ ఇవ్వండి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన నాయుడుకి వినతి పత్రం ఇచ్చిన బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని. అనంతరం ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు విమాన సర్వీసులు ప్రారంభించండి.

విజయవాడ నుండి వారణాసి వ‌యా వైజాగ్, విజయవాడ నుండి కలకత్తా వ‌యా విశాఖపట్నం, విజయవాడ నుండి బెంగళూరు వ‌యా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుండి అహ్మదాబాద్, విజయవాడ నుండి పుణే విమాన స‌ర్వీసుల ప్రారంభించాల‌ని అభ్య‌ర్థించినట్టు తెలిపారు. ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన స‌ర్వీసులు త‌క్ష‌ణం ప్రారంభించేలా చూడాల‌ని కోరిన ఎంపి కేశినేని శివనాథ్. ఎంపి కేశినేని శివ‌నాథ్ అభ్య‌ర్ధ‌న పై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ కింజ‌రపు రామ్మోహ‌న్ నాయుడుకి లిఖిత పూర్వ‌కంగా అభినంద‌న‌లు తెలిపారు ఎంపి కేశినేని శివ‌నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version