Rajasthan Royals Accused Of Match-Fixing After Defeat To LSG: ఐపీఎల్ 2025 లో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్(RR)పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. జైపూర్లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్లో ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారని ఆరోపించారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ.

హోమ్ గ్రౌండ్లో గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓడిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని, ఈ మ్యాచ్పై వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు జైదీప్ బిహానీ. అయితే, జైపూర్లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్లో ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపణలు చేసిన తరుణం లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ (RR) యాజమాన్యం స్పందించలేదు.