బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తీవ్ర విషాదం నెలకొంది, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సిబి జట్టును స్టేడియంలో సత్కరించనున్నారు. దీంతో అక్కడికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆర్సిబి విక్టరీ పరేడ్ కోసం భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోగా వారిని అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు లాటి చార్జ్ చేశారు.

దీంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో 7 మంది ఆర్సిబి అభిమానులు మృతి చెందారు. కాగా 20 మందికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఫ్రీ పాస్ ల విషయంలోనూ ఆర్సిబి అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.