ఐపీఎల్ 2025 ఫైనల్…బెంగుళూరు ఇజ్జత్ తీసిన యోగ్ రాజ్ !

-

 

ఐపీఎల్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికోసం ఇరు జట్లలోని సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబిపై పంజాబ్ జట్టు విజయం సాధిస్తుందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ జోస్యం చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. పంజాబ్ జట్టుకు కోహ్లీ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

Yograj Singh backs PBKS to trounce RCB in IPL 2025 final but issues massive Virat Kohli warning
Yograj Singh backs PBKS to trounce RCB in IPL 2025 final but issues massive Virat Kohli warning

ఆయనను త్వరగా అవుట్ చెయ్యకపోతే పంజాబ్ జట్టుకు చాలా కష్టమని అన్నారు. 250 పరుగుల పైన లక్ష్యాన్ని కోహ్లీ చేజ్ చేస్తారన్నారు. 10 ఓవర్ల లోపే కోహ్లీ అవుట్ అయితే పంజాబ్ జట్టు సులభంగా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం యోగ్ రాజ్ చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. పంజాబ్ జట్టుకు చాలామంది వారి మద్దతును తెలుపుతున్నారు. పంజాబ్ ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని ఆరాటపడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news