1వ తరగతి చదువుతున్న చిన్నారిపై వృద్ధ టీడీపీ కార్యకర్త అత్యాచారం !

-

వెస్ట్ గోదావరి జిల్లాలో 8 ఏళ్ల బాలికపై (60) ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళలపై రోజురోజుకీ లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల చిన్నారిపై షేక్ మీరావలి (60) అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై ఇలా చేయడంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

నిందితుడిని పట్టుకొని అతనిపై విపరీతంగా దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో నిందితుడు ఉండగా బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ కి భారీ సంఖ్యలో చేరుకొని అక్కడ ఉన్న నిందితుడి గొంతు, ముఖం, కాళ్లు చేతులపై బ్లేడులతో దాడి చేశారు. ఆ దాడిలో షేక్ మీరావళి విపరీతంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. షేక్ మీరావళిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడిని వదిలేస్తే ఊరుకునేది లేదని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిని ఉరితీయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news