టిడిపి నాయకులకు వార్నింగ్ ఇచ్చిన శ్రీకాళహస్తి ప్రేమికులు..వీడియో వైరల్

-

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇద్దరు ప్రేమికుల వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఠాగూర్, లలితల కుమార్తె చంద్రిత,శ్రీకాళహస్తి మండలం రామ పురానికి చెందిన చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు. వాలంటీరుగా పనిచేసే చంద్రశేఖర్ అప్పటికే వివాహితుడు కాగా, ఓ బాబు సంతానం. ఈ ఏడాది జనవరి 10న వీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.

కేవిబిపురం మండలం కోవనూరు సమీపంలో తెలుగు గంగా కాల్వలో ఈనెల 20న బాగా ఉబ్బినస్థితిలో గుర్తుతెలియని యువతి శవం కొట్టుకొచ్చింది. మృతదేహం పై పుట్టుమచ్చలను బట్టి చంద్రిక తల్లిదండ్రులు తమ కుమార్తెనేనని స్పష్టం చేశారు. తమ బిడ్డ చావుకు కారణమైన చంద్రశేఖర్ ను శిక్షించాలంటూ డిమాండ్ చేయగా, వారికి అండగా తేదేపా, జనసేన నేతలు పోలీస్ స్టేషన్ల వద్ద రెండు రోజులు ధర్నాలు చేశారు. ఇంతలో ఏర్పేడు మండలం అంజిమేడు సమీపంలోని బండమానుకాలువ వద్ద ఈనెల 22న యువకుడు మృతదేహం బయటపడింది.

పోలీసులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు చూసేందుకు రాలేదు. చంద్రిత తల్లిదండ్రులను పిలిపించగా, ఆ మృతదేహం చంద్రశేఖర్ దేనిని చెప్పారు. పోలీసులు అనుమానంతో డిఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ రెండు మృతదేహాలను శ్రీకాళహస్తి ఆస్పత్రిలో తరలించి, ఇప్పటికీ మార్చురీ లోనే ఉంచారు. చంద్రిత తల్లిదండ్రులు సైతం తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని తీసుకెళ్లమని భీష్మించారు. తాజాగా ఆదివారం ‘మేము బాగున్నాం. త్వరలోనే రామ పురానికి వస్తున్నాం. మాపై వస్తున్నవన్నీ పుకార్లే. మేము సంతోషంగా ఉన్నాం’ అంటూ చంద్రశేఖర్, చంద్రిత లు పంపిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. ఈ కేసు విచారిస్తున్న పుత్తూరు గ్రామీణ సిఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ, అనుమానస్పదంగా బయటపడిన రెండు శవాలపై మాకు అనుమానం ఉన్నందునే డిఎన్ఏ పరీక్షలకు పంపామని, అంత్యక్రియలు చేయలేదని తెలిపారు. ఆ నివేదికలు వస్తే మృతులెవరో తేలుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version