SSLV D2 : నేడు నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2

-

ఏపీలోని తిరుపతి జిల్లా సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ నుంచి నేడు చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏర్పాట్లను ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ షార్‌లోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం రిహార్సల్స్‌ నిర్వహించి, రాకెట్‌ పనితీరు బాగున్నట్లు నిర్ధారించారు.

అనంతరం ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌) సమావేశం నిర్వహించాక ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఇవాళ వేకువజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగింది. ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరనుంది.

ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్‌-07 ఉపగ్రహంతో పాటు యూఎస్‌ఏ అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్‌-07, 880 సెకన్లకు జానుస్‌-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version