తెలంగాణలో డ్రగ్స్ సరఫరా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ రిక్వెస్ట్

-

ఏపీ, ఒరిస్సా లాంటి ఇతర రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు డ్రగ్స్ సరఫరా అవుతుంది అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎక్కువ శాతం డ్రగ్స్ ఉపయోగించేది పబ్లో అని అన్నారు. నగరంలోని దాదాపు అన్ని పబ్బుల్లో డ్రగ్స్ సప్లై అవుతుందని, ఈ క్రమంలోనే యువత డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఇటీవల చిరంజీవి డ్రగ్స్ వ్యతిరేకంగా ఓ వీడియో చేశారని చెప్పారు .అదే విధంగా డ్రగ్స్ కంట్రోల్ చేయాలని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ కంట్రోల్ కావాలని తెలంగాణ ప్రభుత్వం కూడా యాంటీ నార్కోటిక్ టీమ్ కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. పార్టీలను పక్కన పెట్టి.. యువతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎవరన్నా పబ్లో కానీ, బయట కానీ డ్రగ్స్ విక్రయించేవాడు దొరికితే.. వారిపై కేసులు పెట్టొద్దని, యూపీలో ఏవిధంగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ క్రైమ్న కంట్రోల్ చేస్తున్నారో దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. భయం లేకపోతే ఎవరూ కూడా డ్రగ్స్ అమ్మడం మానరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version