ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు

-

ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఐ అండ్ పీఆర్ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు హిమాన్షు శుక్లా. సమాచార, పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందని అన్నారు. అంతకుముందు ఐ అండ్ పీఆర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాన్షు శుక్లాకు ఘనస్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ తర్వాత పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ.మధుసూధన,జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్, తేళ్ల కస్తూరి, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్లు నాగరాజు,సి.వి. కృష్ణారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్లు జీవీ. ప్రసాద్,ఎం.భాస్కర్ నారాయణ, వెంకటరాజు గౌడ్, ఎఫ్ డీసీ జనరల్ మేనేజర్. శేష సాయి, ఐ అండ్ పీఆర్ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version